ఖమ్మం, జూన్ 11: సుప్రీం కోర్టు ప్రధాన నాయ్యమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి వచ్చిన ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి మెమెంటోను ప్రదానం చేశారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులతోపాటు శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్, ఆరికెపూడి గాంధీ, ఎన్.భాస్కర్రావు, కోనేరు కొనప్ప తదితరులు ఉన్నారు.