కొవిడ్ సమయంలో దాతృత్వం చాటుక్ను ఎన్ఆర్ఐలు
భద్రాద్రి కలెక్టర్ చేతుల మీదుగా పరికరాల అందజేత
కొత్తగూడెం, మే 22: కొవిడ్ కష్టకాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి దాతలు భారీ సాయం అందించారు. కరోనా బాధితులను కాపాడుకుంటున్న సర్కారు వైద్యులకు అవసరమైన పరికరాలను ఎన్ఆర్ఐలు, స్థానిక వ్యాపారవేత్తలు, ఐఎంఐ బాధ్యులు కలిసి వితరణ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఎంవీ రెడ్డి చేతులు మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరళకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఐసీయూ బెడ్స్ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొత్తగూడెం అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ సహకారంతో ఎన్ఆర్ఐలు రూ.12 లక్షల విలువైన పరికరాలను అందజేయడం హర్షణీయమని అన్నారు. చిరాగ్ ఫౌండేషన్ బాధ్యులు అత్తులూరి ఉమా, పార్వతి దంపతుల కూతురు మృదుల, నవీన్ అనే ఎన్ఆర్ఐలు పది ఐసీయూ బెడ్లు, ఆరు సీపాప్లు, 50 పల్స్ ఆక్సీమీటర్లు అందజేశారు. మిట్టపల్లి పాండయ్య కుమార్తె శిరీష ఐదు ఐసీయూ బెడ్లు, 5 స్లిట్ ఏసీలు అందజేశారు. చాంబర్ఆఫ్ కామర్ అధ్యక్షుడు కొదుమూరి శ్రీనివాస్ 20 స్టాండ్ ఫ్యాన్లు, 10 కుర్చీలు అందజేశారు. ప్రముఖ వస్త్రవ్యాపారి తాటిపల్లి శంకర్ బాబు స్లిట్ ఏసీని ఆసుపత్రికి వితరణ చేశారు. అదనపు కలెక్టర్ అనుదీప్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, సూపరింటెండెంట్ డాక్టర్ సరళ, జిల్లా బ్లాక్ ఫంగస్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ పోటు వినోద్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.