చండ్రుగొండ: భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఏజెన్సీ దళితసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్దంతి వేడుకల్లో ఆయన పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం వారి ఉన్నతికి రాజ్యాంగం ఎంతో తోడ్పతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసి కొణకండ్ల వెంకటరెడ్డి, ఏజెన్సీ దళిత సేవా సంఘం జిల్లా అద్యక్షులు నడ్డి రవికుమార్, మండల ప్రధాన కార్యదర్శి కోండ్రు నాగరాజు, కాంగ్రెస్ నాయకులు వగ్గెల పూజిత, సాబీర్హుస్సేన్, దారం గొవిందరెడ్డి, బడుగు శంకర్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, ,న్యూడెమోక్రసీ నాయకులు వరికూటి వెంకట్రావ్, సిపిఐ నాయకులు ఖాజా మోహిద్దిన్, తదితరులు పాల్గొన్నారు.