అశ్వారావుపేట : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ఫామ్ సాగు విస్తరణ, మొక్కల ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్కుమార్ స్పష్టం చేశారు. సాగు యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ కార్యాలయంలో శనివారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నర్సరీ నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు రైతులను సమన్వయం చేసుకుంటూ సాగు విస్తరణపై దృష్టి సారించాలని ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన మొక్కలను ఉత్పత్తి చేస్తున్నామని, డిసెంబర్ 15వ తేదీ నుంచి రైతులకు మొక్కలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఉచితంగా అందించే ఎరువుల కోసం సంస్థకు ప్రతిపాదనలు పంపింపామని, వచ్చిన వెంటనే రైతులకు సరఫరా చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో పలువురు క్షేత్ర సహాయకులు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.