చండ్రుగొండ: పంటమార్పిడి పద్ధతిలో పంటల సాగు చేయాలని మండల వ్యవసాయశాఖ అధికారి అనూష అన్నారు. మంగళవారం రావికంపాడు క్లస్టర్ రైతువేదిక భవనంలో జరిగిన గుర్రాయిగూడెం రైతు అవగాహన సమావేశంలో ఏఓ పాల్గొని ప్రసంగించారు. వరి పంట కాకుండా ఇతర పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. అపరాలు, ఉద్యానవన పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో రైతులు పాల్గొన్నారు.