సారపాక: సారపాక పంచాయతీ కార్యాలయంలో పోడు భూముల రైతులకు ఈవో కంది మహేష్ అవగాహన కల్పించారు. అటవీ హక్కులు, పోడు భూములకు సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం పోడుభూముల రైతుల సమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు చేపట్టిందని, పోడు రైతులు తమ భూములకు సంబంధించి సమస్యలుంటే గ్రామసభల్లో తెలిపి పరిష్కారం పొందాలని, తాజాగా ఏర్పాటు చేసిన ఎఫ్ఆర్సీ కమిటీల ద్వారా పోడు భూములకు సర్వే నిర్వహిస్తారు.
అనంతరం మండల అధికారులకు నివేదిక అందించి అనంతరం పోడు రైతులకు పట్టాలు అందిస్తారని తెలిపారు. రైతులకు పోడుభూములకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలో ఈసందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో పంచాయతీ సిబ్బందితో పాటు పోడుభూముల రైతులు పాల్గొన్నారు.