చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో రైతులు వరికి బదులు ఇతర పంటలైనా పెసర, వేరుశనగ,జొన్న, నువ్వులు, మినుము, కూరగాయలువంటివి సాగు చేసుకోవాలన్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ తడులతో వచ్చే పంటలను సాగు చేసుకోవాలని, పంట మార్పిడి వల్ల భూసారం సైతం పెరుగుతుందన్నారు.
వానకాలం పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో పంటను పూర్తిగా ఆరబెట్టుకోవాలని, తూర్పారబెట్టి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఏఈఓ విజయ్,రైతులు పాల్గొన్నారు.