ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు యాసంగి పంటల సాగుకు సంబంధించి శిక్షణ, అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులకు ముఖ్యఅతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ యాసంగిలో వరి దిగుబడి, ఉత్పత్తిని కేంద్రం కొనదని, అంతేకాకుండా వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని ఈ తరుణంలో రైతులందరూ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల పంటలను సాగుచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏవో కరుణామయి, ఏఈవోలు మనోహర్ నాయక్, వైష్ణవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.