కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దసరా సంబురాలు ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో మొర్రేడు వాగు, రైటర్బస్తీ, రామవరం, రుద్రంపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భధ్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు జరుపుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్ తదితరులు ఈ సంబురాల్లో పాల్గొననున్నారు.