మణుగూరు: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ డైరెక్టర్ కేవై నాయక్ ఆదేశాల మేరకు రెండో విడుత దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్, మణుగూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో 2021 విద్యా సంవత్సరంలో రెండో విడత ప్రవేశాల కోసం ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు https//iti.telangana.gov.in లో తెలుసుకోవచ్చన్నారు.