పర్ణశాల: పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి దంపతులు, కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి అర్చకులు భార్గవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పంచవటి, నారచీరెల ప్రాంతాన్ని దర్శించుకుని ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కొల్లు వెంకటరెడ్డి, కడియం రామారావు, గాదె వెంకటరెడ్డి, గంటా కృష్ణ, వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, ఆలయ ఇన్చార్జ్ ప్రసాద్, రాము, శివ, ఆర్ఐ ఆదినారాయణ పాల్గొన్నారు.