దమ్మపేట : పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలుచేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సీడీపీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత మూడు నెలల క్రితం ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లతో పాటు హెల్పర్లకు 30శాతం పీఆర్సీని అమలుచేస్తామని హామీ ఇచ్చిందని, పెంచిన వేతనాలు తక్షణమే అందించాలని ఆ వినతిలో కోరారు.
కనీస వేతనచట్టం ప్రకారం రూ.24వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వూకే ముత్తమ్మ, కారం భద్రమ్మ, కొమరం రాజేశ్వరి, కారం దుర్గ, కొమరం అరుణ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.