రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పిట్ సెక్రటరీ ఎస్కే.గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సీహెచ్పీ డీవైజీఎం వెంకటేశ్వరరావు, మోహన్రెడ్డి, కేశవరెడ్డి, నిమ్మల రాజేశ్వరరావు, గట్టయ్య, టెంపుల్ కమిటీ మెంబర్లు ఈఎన్ మూర్తి, ఉద్యోగులు, సూపర్ వైజర్లు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు.