భద్రాద్రి కొత్తగూడెం : ఒడిశా నుంచి అక్రమంగా కారులో హైదరాబాద్కు తరలిస్తున్న 421 కిలోల గంజాయిని భదాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. దుమ్ముగూడెం మండలం అంజుబాక వద్ద పోలీసులు ఈ మధ్యాహ్నం వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి కారులోని నలుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 84 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి భద్రాచలం మీదుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు గంజాయి అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది. ఈ మేరకు అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది.