మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక పార్థనలు
కొవిడ్ నిబంధనలు అమలు
ప్రత్యేక సందేశమిచ్చిన మతపెద్దలు
ఖమ్మం, కొత్తగూడెం, జూలై 21 : ఉమ్మడి ఖమ్మం జిలాలో బుధవారం బక్రీద్ వేడుకలు కొవిడ్ నిబంధనలను అనుసరించి ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పలు మజీద్లలో ముస్లింలు పిల్లలతోపాటు వచ్చి ‘ఈదుల్ అజ్హా’ ప్రత్యేక నమాజును ఆచరించారు. వస్ర్తాలు ధరించుకొని, ఇత్తరు వంటి సుగంధ ద్రవ్యాలు పూసుకొని సందడిగా కనిపించారు. ఈద్గా నిర్వాహకులు నీటి వసతులు కల్పించారు. త్యాగం, బలిదానంకు చిహ్నమైన పండుగను సంతోషంగా చేసుకున్నారు. ఇదిలా ఉండగా మసీదులు, ఉర్దూ పాఠశాలలవద్ద ముస్లిం సోదరులు ఖుర్బానీ చేసి పంపిణీ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు ముస్లిం సోదరుల ఇంటికి వెళ్లి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మసీద్ల వద్ద పోలీస్శాఖ బందోబస్తు నిర్వహించారు. పోలీసులు కూడా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో బక్రీద్
ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన ఈద్-ఉల్-జుహా బక్రీద్ను కరోనా నిబంధనల నడుమ బుధవారం మణుగూరులో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పీవీ కాలనీలోని మజీద్ మహ్మదీయ మసీదులో పరిమిత స్థాయిలో ముస్లిం సోదరులు బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సింగరేణి అధికారుల సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా బక్రీద్ జరిగింది.
నియోజకవర్గవ్యాప్తంగా ముస్లింలు తమ ఇళ్ల వద్దనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు భౌతికదూరం పాటిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లింలు నిరుపేదలకు కుర్బానీ అందజేశారు. వర్షం పడుతున్నా పలు మసీదుల్లో ముస్లింలు తమ ప్రార్ధనలు కొనసాగించారు. నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అశ్వాపురం, జూలై 21: ముస్లిం సోదరులు బుధవారం మండల కేంద్రంలోని జమా మజీద్లో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు.
బత్తిన కుటుంబానికి పాయం పరామర్శ
మోరంపల్లిబంజరలో ప్రముఖ పాల వ్యాపారి బత్తిన హరినారాయణ బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలతలు వారి నివాసానికి వెళ్లి హరినారాయణ భౌతికకాయం సందర్శించి పూలమాలతో నివాళులర్పించారు.