నీలగిరి,జూన్ 21 యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని రోజు వారీగా యోగా చేస్తే మానసికంగా ప్రశాంతతతో పాటు శరీర నిర్మాణంలో మార్పు వస్తుందని జిల్లా జైలు సూపరింటెండెంట్ లకావత్ దేవ్లా అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నల్లగొండలోని జిల్లా జైలులో ఆర్యసమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాదినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్, జైలర్ జిల్లా సబ్ జైలర్ టి. కళాసాగర్, అనిల్కుమార్, జనార్దన్రెడ్డి, రామలింగయ్య పాల్గొన్నారు.
బెటాలియన్లో..
12వ బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుల్ యోగా చేశారు.
నీలగిరి కళాశాలలో..
రామగిరి : నల్లగొండలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మారం నాగేందర్రెడ్డి మాట్లాడుతూ యోగాతో ఏకగ్రత, మానసిక ప్రశాంతత, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. క్రార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓలు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల వ్యాయామ విద్య విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో విద్యార్థులకు యోగా విశిష్టతపై నిర్వహించిన వెబినార్లో యోగా గురువు మాదగాని శంకరయ్య హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఏ.సీహెచ్ పుల్లారావు, ఎన్ఎస్ఎస్ పీఓలు పాల్గొన్నారు.
నిత్యం యోగా చేయాలి
హాలియా, జూన్ 21 : పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు నిత్యం యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తున్నదని మున్సిపల్ కౌన్సిలర్ యడవల్లి అనుపమా నరేందర్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండలంలోని అలీనగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పంపిణీ చేయడంతో పాటు యోగా ఆవశ్యతకను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రజనీ, సిబ్బంది పాల్గొన్నారు.
నందికొండ : హిల్కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది ఆధ్వర్యంలో యోగాడే నిర్వహించారు. అందరితో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ నాగశిరీష, టీచర్లు, కిశోర బాలికలు పాల్గొన్నారు.
దేవరకొండ : యోగా సంపూర్ణ జీవన విధానమని యోగా గురువు అర్జున్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో యోగాడే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా శరీర, మానసిక రుగ్మతలను దూరం చేసేందుకు చక్కని పరిష్కారమన్నారు. కార్యక్రమంలో జగదీశ్వర్రెడ్డి, కృష్ణయ్య, వనం ఇద్దయ్య, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్ : ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని పొందవచ్చని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ జయరాజన్ అన్నారు. సోమవారం పాఠశాలలో యోగాడేను నిర్వహించారు. యోగా ట్రైనర్ వినోద్చంద్రన్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.