ముంబై: ప్రైవేట్ ఈక్విటీ కార్లైల్ గ్రూప్ సంస్థ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిధులను సేకరించాలన్న ప్రతిపాదనను దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అడ్డుకట్ట వేసింది.
ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద కార్లైల్ సంస్థకు వాటాలు విక్రయించి నిధులు సేకరించాలని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రతిపాదించింది. దీనిపై తాము స్వతంత్ర ప్రతిపత్తి గల రిజిస్టర్ సంస్థతో షేర్ల విలువను అంచనా వేసే వరకు ఈ ప్రతిపాదనను నిలిపేయాలని సెబీ ఆదేశించింది.
అన్ని చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ తెలిపింది. ఇండిపెండెంట్ వాల్యూయర్ రిపోర్ట్ ప్రకారం ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపుపై పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ద్వారా నిధులు సేకరించాలన్న పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రతిపాదిత ఒప్పందం.. మైనారిటీ వాటాదారులకు అనుచితం అని సెబీ నియమిత ఎస్ఈఎస్ సంస్థ పేర్కొంది. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సేకరించవచ్చునని తెలిపింది.