హైదరాబాద్ : నకిలీ కరెన్సీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1 2 వేల ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పరి రాజుప్రసాద్ అనే వ్యక్తి జిరాక్స్ ద్వారా కొంతకాలంగా రూ.2 వేల ఫేక్ కరెన్సీ నోట్లను తయారు చేసి మారుస్తున్నాడు. ఈ ఉదయం ఓ దుకాణం వద్ద నోట్లను మార్చేందుకు యత్నిస్తుండగా యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజుప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలోనూ నకిలీ నోట్లు మారుస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.