పెద్దవంగర, జూన్ 15: అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పూర్తి చేయాలని, ఎక్కడా రాజీపడొద్దని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బొమ్మకల్ గ్రామంలో పర్యటించి నర్సరీ, డంపింగ్యార్డు, శ్మశానవాటికలను పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనుల నిర్వహణపై పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో వంద శాతం మొక్కలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో 90శాతం మొక్కలు పెరిగేలా చూడాలన్నారు. ప్రతి రోజు గ్రామంలో తడి,పొడి చెత్తను సేకరించాలన్నారు.
సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందు పిచికారీ చేయాలన్నారు. ప్రతి పనిని రికార్డు ల్లో నమోదు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అందజేసిన భూముల్లో లబ్ధిదారులే సాగు చేసుకోవాలని, వారిని అడ్డుకునే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ దీపికరెడ్డి, తహసీల్దార్ యోగేశ్వర్ రావు, ఎంపీడీవో శేషాద్రి, ఎంపీవో యాకయ్య, ఇన్చార్జి ఏపీవో పార్థసారధి, టీఏ యాకయ్య, పంచాయతీ కార్యదర్శి నరేశ్, రైతుబంధు సమితి మండల సభ్యులు సోమనర్సింహారెడ్డి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.