మేడ్చల్ రూరల్, జూన్ 15 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం రూ.4.04 కోట్లతో చేపట్టిన స్వాగత తోరణాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, సింగిల్ ఆర్మ్ లైటింగ్, ఓపెన్ జిమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయని.., ఆయా సంస్థల్లో గత ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్, వీధి దీపాలు, ఓపెన్ జిమ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.300 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత గుండ్లపోచంపల్లిలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు జైపాల్రెడ్డి, మల్లికార్జున్ ముదిరాజ్, చింత పెంటయ్య, హేమంత్ రెడ్డి, అమరం సరస్వతి, హంసరాణి, బేరి బాలరాజు, వీణ, మారేపల్లి రాజకుమారి, రజితావెంకటేశ్ ముదిరాజ్, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సంజీవగౌడ్, కందాడి నరేందర్రెడ్డి, సురేందర్ గౌడ్, లక్కిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జనార్దన్రెడ్డి, సుధాకర్, ఫిలిప్స్, అమరం మోహన్రెడ్డి, సత్తిరెడ్డి, ఆదిత్యరాజ్ సింగ్, భానుచందర్ పాల్గొన్నారు.