జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రంలో 96 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామన్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నులు రైతుల వద్ద ఉన్నట్లు అంచనా వేశారు. కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు. కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
ప్యారా బాయిల్డ్ రైస్ తీసుకోమని గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందన్నారు. రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే లైన్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నాన్చుడి ధోరణిని అవలంభిస్తున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శగా ఉందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి