హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పత్తి పంటకు అతిపెద్ద సమస్యగా మారిన గులాబీ తెగులుకు అత్యాధునిక టెక్నాలజీతో చెక్ పెట్టనున్నారు. ఈ తెగులును ముందే గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించనున్నారు. ఈ మేరకు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వాద్వానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నది. వర్సిటీ వీసీ ప్రవీణ్రావు, సంస్థ ప్రతినిధి రఘు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ టెక్నాలజీని తొలిదశలో ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో అమలుచేయనున్నారు.