మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారం మండలం బాల్యతండాకు చెందిన గుగులోత్ చిరంజీవికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో వైద్యులు హైదరాబాద్ తరలించారు. ఈ నెల 7న అతడికి కరోనా పాజిటివ్ రాగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో మహబుబాబాద్ ఏరియా దవాఖానలో ఐదు రోజుల పాటు చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. రెండు రోజుల తర్వాత పంటి నొప్పితో బాధపడుతూ మళ్లీ మహబుబాబాద్ ఏరియా దవాఖానకు వెళ్లగా పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు.
పరీక్షల కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. అయితే మండలంలో కరోనాతో పలువురు వ్యక్తులు చనిపోగా బ్లాక్ ఫంగస్ కలకలంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి