రామాయంపేట, తూప్రాన్ రూరల్, చేగుంట, నిజాంపేట, మే 20ః లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నామని డీఎస్పీ కిరణ్కుమార్ అన్నారు. గురువారం రామాయంపేటకు విచ్చేసిన డీఎస్పీ పట్టణంలోని సిద్దిపేట, మెదక్ చౌరస్తాలో శాంతి భద్రతలను పర్యవేక్షించి రామాయంపేట ఎస్ఐ రాజేశ్ను ప లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తూప్రాన్ డివిజన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 240 కేసులు నమోదు చేశామన్నారు. కొవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలన్నారు.మండలాల పరిధిలోని పట్టణ, పరిసర గ్రామాల్లో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు వచ్చి నిత్యావసరాలు తీసుకెళ్తున్నారు.
నర్సాపూర్లో…
నర్సాపూర్/కొల్చారం మే 20 : నర్సాపూర్ నియోజకవర్గంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నర్సాపూర్ పట్టణంలో సీఐ లింగేశ్వర్, ఎస్సై గంగరాజు వాహనదారులకు అవగాహన కల్పించారు. వెల్దుర్తి మండలంలో ఎస్సై మహేందర్ వాహనదారులకు అవగాహన కల్పించారు. కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాల్లో దుకాణాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్సై శ్రీనివాస్గౌడ్ మండల పరిధిలోని కొల్చారం, పోతంశెట్పల్లి చౌరస్తా, రంగంపేట, దుంప లకుంట చౌరస్తాలో పోలీ సులు పెట్రోలింగ్ నిర్వహించారు
చిలిపిచెడ్లో..
చిలిపిచెడ్, మే 20 : మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. చండూర్ చౌర స్తా, మెదక్-సంగారెడ్డి రోడ్డుపై ఎస్సై మల్లారెడ్డి సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు.