న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర రూ.47 వేలకు పైనే కొనసాగుతున్నది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.348 పెరిగి రూ.47,547కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ గోల్డ్ ధర రూ.47,199 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరుగడమే దేశీయంగా బంగారం ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.936 పెరిగి రూ.71,310కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,374 వద్ద ముగిసింది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,853 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.70 అమెరికన్ డాలర్లు పలికింది.