ఫేస్బుక్లో యువతి పేరుతో పరిచయం అయిన సైబర్చీటర్.. తార్నాకకు చెందిన 63 ఏండ్ల వృద్ధుడికి రూ. 2.28 లక్షలు టోకరా వేసింది. ఫేస్బుక్లో కరీంసహరా పేరుతో నగరానికి చెందిన ఓ వృద్ధుడికి సైబర్చీటర్ పరిచయం అయ్యింది. కొన్నాళ్లు ఇద్దరు చాటింగ్ చేసి.. స్నేహం పెంచుకున్నారు. ఈ క్రమంలో తాను హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతానని, తన వ్యాపారాలు మీరు చూసుకోవాలని చెప్పింది. వ్యాపారంలో పెట్టుబడులకు మీకు నగలు, డాలర్లను పంపిస్తున్నానని నమ్మించి.. అందుకు సంబంధించి ఫొటోలను వాట్సాప్లో పంపించింది. రెండు రోజులకు ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అంటూ ఆ వృద్ధుడికి ఫోన్ చేశారు. మీ పేరుతో పార్శిల్ వచ్చింది.. అందులో డాలర్లు, ఆభరణాలు ఉన్నాయి.. వాటికి ట్యాక్స్లు, జీఎస్టీ కట్టాలంటూ అతడి నుంచి మూడు దఫాలుగా రూ. 2.28 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోతున్నానని గుర్తించిన బాధితుడు బుధవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.