ఒకప్పుడు గ్రామాల్లో నాయీబ్రాహ్మణులు ఇంటికే వచ్చి క్షౌరం చేసేవారు. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఆ విధానం కొనసాగుతున్నది. నగరంలో మాత్రం అర్బన్ క్లాప్ వంటి సెలూన్లు గత ఏడాదే కస్టమర్ల ఇంటి వద్దే సేవలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే నాయీ బ్రాహ్మణులు కూడా కరోనా నేపథ్యంలోనే తమ సేవలను ఆధునీకరించారు. తమకు చిరకాలంగా తెలిసిన వినియోగదారుల ఇండ్ల వద్దకే వెళ్లి క్షవర సేవలు చేసేలా తమ పనివిధానాన్ని మార్చుకుంటున్నారు.