నారాయణపేట : నీటి గుంతలో పడి ఓ చిన్నారి (ఏడాది) మృతి చెందిన సంఘటన జిల్లాలోని కోస్గి మండలం కడంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పవన్కుమార్, వైదేహిల కుమార్తె శనివారం ఉదయం ఆడుకుంటూ ఇంటి వద్ద ఉన్న నల్ల గుంత వద్దకు వెళ్లింది.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడింది. నీరు నిండుగా ఉండడంతో ఊపిరాడక మృతి చెందింది. కొద్దిసేపటికి చిన్నారి కనిపించడంలేదని.. వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదంలో నెలకొంది.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఎమ్మెల్సీ కవిత
కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి
పేదింటి ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది