పకడ్బందీగా కరోనా పరీక్షలు
సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిర్వహణ
ఇప్పటివరకు 4,232 మందికి కరోనా పరీక్షలు..
398 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ
కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో గర్భిణులకు ఇబ్బందులు లేకుండా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిండు గర్భిణులు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు వీలుగా సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఓపీ బ్లాక్ ఆవరణలో ప్రత్యేకంగా కరోనా నిర్ధారణ పరీక్ష సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ దవాఖానకు వచ్చే గర్భిణులు, ఇతరులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
సామూహికంగా ఉన్న జనాల మధ్యకు గర్భిణులు వెళ్లొద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ కొవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 6 నుంచి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసిన విషయం విధితమే. కాగా మార్చిలో 1856 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 15 మంది గర్భిణులు, 14 మంది దవాఖాన సిబ్బందితో పాటు 158 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్లో 2,310 మందికి కరోనా పరీక్షలు చేయగా మొత్తం 204 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా అందులో 38 మంది గర్భిణులు, 12 మంది దవాఖాన సిబ్బంది, 154 ఇతరులు ఉన్నారు. సాధారణంగా కొవిడ్ రిపోర్టు ఉన్న రోగులకే దవాఖాన ఓపీలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు సుముఖంగా ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దవాఖాన సూపరింటెండెంట్ ముందస్తు ఆలోచనతో వైద్య ఉన్నతాధికారులను ఆశయ్రించి దవాఖాన ఆవరణలో కరోనా నిర్ధారణ పరీక్ష సెంటర్ను ఏర్పాటు చేయించారు.