రంగారెడ్డి, మే 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కొత్తూరులో అధికార పార్టీ టీఆర్ఎస్ పాగా వేసింది. ఇక్కడ మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరుగగా 7 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. మిగతా 5 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచారం ముగిసేవరకు అంతా తానై స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముందుండి నడిపించారు. కొత్తూరులో బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించినా కనీసం ఒక్క వార్డులో కూడా గెలవలేదు.