పటాన్చెరు, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ హయాంలో ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 14ఏండ్ల పాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘపోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తుచేశారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలను పూర్తిచేసుకోవడం సంతోషమన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, విజయ్కుమార్, నర్ర భిక్షపతి పాల్గొన్నారు.