హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు, సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. యూనివర్సిటీల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ బారినపడుతున్న వారిలో 40 శాతం యువకులేనని సర్వేలు చెబుతున్నాయని గవర్నర్ గుర్తుచేశారు. అధ్యాపకులు, సిబ్బంది టీకా తీసుకొని స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.
కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు పొందలేని వారికి డిజిటల్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి