న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్తో దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు, మదుపర్ల సెంటిమెంట్ దెబ్బ తినవచ్చునని తెలిపారు.
కరోనాతో ఆర్థిక వ్యవస్థపై పడే దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కొన్ని రోజులతో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా దిగజారాయని రాజీవ్ కుమార్ తెలిపారు. అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 11 శాతం ఉండొచ్చునని అంచనా వేశారు.
దేశంలో కరోనా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న తరుణంలో బ్రిటన్తో సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వైరస్ స్ట్రెయిన్లు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయన్నారు. రెండో వేవ్ ప్రభావాన్ని ఆర్థికశాఖ అంచనా వేశాకే.. మరో దఫా ఉద్దీపన చర్యల అవసరంపై ఓ అంచనాకు రాగలమని రాజీవ్ కుమార్ తెలిపారు.
ఇప్పటికే ఆర్బీఐ పరపతి విధానాన్ని యధావిధిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నదని రాజీవ్ కుమార్ గుర్తు చేశారు. కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్యాకేజీ కింద కేంద్రం గత ఏడాది పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..