రంగారెడ్డి : కుటుంబ సభ్యులతో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జిల్లాలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మంగళి చంద్రశేఖర్(35) హైదరాబాద్ పట్టణంలో జీవినం సాగిస్తున్నాడు. ఆస్తి విషయంలో సోమవారం తంగెళ్లపల్లి గ్రామానికి వచ్చి ఆతని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు.
ఆస్తి విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని గ్రామ సమీపంలోని మంగలి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందే భార్యకు పోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. మంగళవారం ఉదయం చెరువులో మృతదేహం లభించింది. మృతుడు చంద్రశేఖర్ భార్య నిర్మళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడు చంద్రశేఖర్కు కొడుకు, కూతురు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల