కౌరి: ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆర్క్ పూర్తవడం ఓ మైలురాయిగా నార్తర్న్ రైల్వేస్ అభివర్ణించింది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడువు 1.3 కిలోమీటర్లు కాగా.. రూ.1486 కోట్ల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. ఉధమ్పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ అతి ఎత్తయిన బ్రిడ్జ్ను నిర్మించాలని నిర్ణయించారు. ఇది ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తు ఎక్కువ ఉండటం విశేషం.
కశ్మీర్ను మిగిలిన దేశంలో అనుసంధానించడంలో భాగంగా చేపట్టిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్లో సోమవారం ఓ చారిత్రక మైలురాయిని నార్తర్న్ రైల్వేస్ పూర్తి చేసింది. ప్రాజెక్ట్ మొత్తం రెండున్నరేళ్లలో పూర్తవుతుంది అని నార్తర్న్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు. ఈ బ్రిడ్జ్ ఆర్క్ నిర్మాణం పూర్తయ్యే ఘట్టాన్ని వీడియో లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ చూశారు. రెండు భాగాలుగా ఉన్న ఆర్క్ను కలిపే 5.6 మీటర్ల లోహాన్ని సోమవారం కలిపి మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మొత్తం 28,660 మెట్రిక్ టన్నుల స్టీలు, 66 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వాడినట్లు అశుతోష్ వెల్లడించారు.
ఇవికూడా చదవండి..
గే పెళ్లిళ్ల వల్లే కరోనా వచ్చిందట!
హోమ్లోన్పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో