నిర్ణీత సమయంలో పూర్తిచేయాలి
పలు మండలాల్లో డబుల్ బెడ్ రూం
ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
భీమ్గల్/వేల్పూర్/మోర్తాడ్(కమ్మర్పల్లి)/బాల్కొండ (ముప్కాల్ ), ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,గృహనిర్మాణ,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని సూచించారు.భీమ్గల్, బడా భీమ్గల్తోపాటు వేల్పూర్, పడగల్, మోర్తాడ్, బాల్కొండలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పనుల్లో అలసత్వం వహించరాదన్నారు. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కమ్మర్పల్లి, మెండోరా మండల కేంద్రాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై అధికారులతో చర్చించి, పనులు ప్రారంభించాలని సూచించారు. మెండోరా మం డల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంకోసం స్థలా న్ని పరిశీలించారు. మంత్రి వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.అనంతరం మంత్రి వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో ఆర్డీవో, తహసీల్దార్లతో సమావేశమయ్యారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, పనుల పురోగతిపై సమీక్షించారు.