పల్లెప్రగతితో గార్ల మండలానికి కొత్తరూపు
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనాలు
51కి గాను 49 పార్కులు పూర్తి
అన్ని జీపీల్లో డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం
13 గ్రామాల్లో వైకుంఠధామాల ఏర్పాటు
పల్లె ప్రగతితో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రకృతివనాలు గ్రామాలకు వన్నె తెచ్చాయి. ఏపుగా పెరుగుతున్న తీరొక్క మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వాటిలోనే చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు, పెద్దల కోసం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. ఇక దాదాపు అన్ని జీపీల్లో సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తికాగా, 13 జీపీల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేశారు.
గార్ల, మార్చి 30 : పల్లె ప్రగతి కార్యక్రమం గార్ల మండలంలో పక్కాగా అమలవుతున్నది. ప్రభుత్వం నెలనెలా ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతిబాట పడుతున్నా యి. ప్రభుత్వం ఇచ్చిన రూ.4.51కోట్ల నిధులను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వివిధ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశారు. మండల పరిధిలోని గార్ల, బుద్దారం, సత్యనారాయణపురం, పినిరెడ్డిగూడెం, రాజుతండా, మర్రిగూడెం, బీఆర్ఎన్తండా, పుల్లూరు, గోపాలపురం, చిన్నబంజర, పోచారం, కోట్యానాయక్తండా, బాలాజీతండా, రాంపురం, మద్దివంచ, ముల్కనూరు, చిన్నకిష్టాపురం, పెద్దకిష్టాపురం, సీతంపేట, శేరిపురం మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 51 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 49 వనాలు పూర్తయి ఆహ్లాదం పంచుతున్నాయి. రూ.11.26 లక్షలు వెచ్చించి సుమారు 53 వేల మొక్కలు నా టారు. జీపీ సిబ్బంది నిత్యం వాటికి నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు.
ఇప్పటికే పూర్తయిన పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో కొంగొత్త వాతావరణాన్ని ఆవిష్కరించాయి. తీరొక్క మొక్కలు గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చిన్నారుల కోసం జారుడు బండలు, రంగుల రాట్నాలు, తూకం వంటి పరికరాలు, పెద్దల కోసం వాకింగ్ ట్రాక్లు, సేదతీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశా రు. ఒక్క గార్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నాలుగు వ నాలు ఏర్పాటు చేశారు. జీవంజిపల్లి, పూమ్యాతండా తహసీల్దార్ కార్యాలయం పక్కన, పెద్ద వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పా టుచేసిన వనాల్లో మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇక 20 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 2.52 కోట్ల నిధులిచ్చింది. ఇప్పటివరకు 13 వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తికాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అదే విధంగా 20 జీపీల్లో రూ.50 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్లను పూర్తి నా ణ్యతా ప్రమాణాలతో నిర్మించారు. అన్ని జీపీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణ పనులూ ముగిశాయి. ముల్కనూరు, గార్ల, శేరిపురం, పో చారం క్లస్టర్లలో రూ.88లక్షలతో రైతు వేదికలను సర్వాంగ సుందరంగా నిర్మించారు.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు కొత్తగా కనిపిస్తున్నాయి. వాటిలో నాటిన మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జీపీ సిబ్బందితో నిత్యం నీళ్లు పోయిస్తున్నాం. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీవో, డీపీవో నిత్యం వనాలను సందర్శించి సూచనలిస్తున్నారు. పశువులు వనాల్లోకి వెళ్లకుండా చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటుచేశాం.