మురిగిపోయిన ఓట్లు 21,309
స్పష్టంగా కనిపించిన అవగాహన లేమి
చెల్లని ఓట్లపై అభ్యర్థి వాణీదేవి అసంతృప్తి
లెక్కింపు ప్రక్రియ వేగవంతం
నేడు ఫలితం వెల్లడయ్యే అవకాశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు ఆసక్తికర చర్చకు దారి తీసింది. పట్టభద్రులైనా..ప్రాధాన్యం గుర్తింపులో పట్టు తప్పారు. ఓటు ఎలా వేయాలో తెలియక చేసిన పొరపాట్లతో వేల సంఖ్యలో ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఒక్కో రౌండ్కు సరాసరి 52,600 ఓట్లను లెక్కిస్తే ..3300 చొప్పున 21 ,309 ఓట్లు పనికిరాకుండాపోయాయి. మొత్తంగా 3,58,348 ఓట్లలో 5.94 శాతం ఓట్లు చెల్లని ఉండటం ఇదే ప్రప్రథమని ఓ అధికారి తెలిపారు. చాలా వరకు అంకె ఒకరికి మించి వేయడం, సంతకాలు చేయడం, ప్రాధాన్యత క్రమంలో అంకెలు రాయాల్సిన చోట ఇంగ్లిష్లో వన్, టూ అని రాయడం, ఇలా చాలా తప్పిదాలు చేశారు. ఈ చెల్లని ఓట్లపై సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ నడుస్తున్నది.