కొండాపూర్ : శాంతి, భద్రతల సంరక్షణలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతగానో సహకరిస్తున్నాయని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్క్లేవ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ రెడ్డి మంజుల రఘునాథ్రెడ్డి, చందానగర్ ఇన్స్పెక్టర్ కాస్ట్రోలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో అల్లరి మూకలకు చెక్ పడిందన్నారు. శాంతి, భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు కల్పిస్తున్న అవగాహన, కాలనీ సంఘాలు, స్థానికులు ముందుకు వచ్చి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అన్నపూర్ణ ఎన్క్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రూ. 4.50లక్షల వ్యయంతో 28 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కాలనీ వాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతిరెడ్డి, రవీందర్రావు, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్రెడ్డి, నాయకులు దాసరి గోపి, జనార్దన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ప్రవీణ్, గుడ్ల ధనలక్ష్మి, గోవర్ధన్రెడ్డి, రవీందర్రెడ్డి, రమణమూర్తి, అంతిరెడ్డి, లింగారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, ఆశీరెడ్డి, శ్రీధర్రెడ్డి, జైపాల్రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.