ఫిబ్రవరిలో 5.03 శాతం
న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 4.06 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.03 శాతానికి ఎగబాకింది. ఆహార ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరిలో 1.88 శాతంగా ఉన్న ఆహార ధరల పెరుగుదల ఫిబ్రవరిలో 3.87 శాతానికి ఎగబాకినట్లు జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్వో) వివరించింది. ఇదేకాలంలో ‘ఫ్యూయల్ అండ్ లైట్’ క్యాటగిరీ ద్రవ్యోల్బణం 3.87 శాతం నుంచి 3.53 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది.
ఈ ఏడాది జనవరిలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి 1.6 శాతం క్షీణించినట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జనవరిలో ఇది 2.2 శాతం వృద్ధి చెందింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో తయారీ రంగ ఉత్పత్తి 2 శాతం, మైనింగ్ ఉత్పత్తి 3.7 శాతం తగ్గింది. కానీ ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి 5.5 శాతం పెరిగింది.