బీజేపీ ఎంపీ సుబ్రమణియన్స్వామి
హైదరాబాద్, మార్చి10(నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నానని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్స్వామి స్పష్టంచేశారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శించుకున్న ఆయన విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిరిండియా ప్రైవేటీకరణనూ వ్యతిరేకించానని, విశాఖ స్టీల్ప్లాంట్పై తనకు అవగాహన లేదని చెప్పారు. ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేస్తామనే విధానం మంచిది కాదని కేంద్రానికి సూచించారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానిని కలిసేటప్పుడు తాను కూడా సీఎం జగన్తో కలిసి వెళ్తానని పేర్కొన్నారు. టీటీడీపై కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ పరువుకు భంగం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై కోర్టులో రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసినట్టు తెలిపా రు. పరువునష్టం దావా వేసిన ఏకేసునూ ఓడిపోలేదని చెప్పారు. తెరవెనుక చంద్రబాబుఉండి టీటీడీపై దు ష్ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. టీటీడీ అకౌంట్లను కాగ్తో ఆడిట్ చేయించాలన్న సీఎం జగన్ నిర్ణయం చాలా మంచిదని, టీటీడీని భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలని సూచించారు.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తేతెలంగాణ): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సంఘీభావం ప్రకటించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ర్టాల హక్కులను, ముఖ్యమంత్రుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కలిసి పోరాటం దిశగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని పేర్కొన్నారు.