రోమ్: మాటియో పెలిసోన్ ర్యాంకింగ్ సిరీస్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అదరగొట్టాడు. పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో తుల్గా తుముర్ ఓచిర్ (మంగోలియా)ను చిత్తుచేసి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అలాగే 14 పాయింట్లతో రోమ్ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. కాగా విశాల్ కాళీరమణ 5-1తో సిర్బాజ్ తల్గత్పై గెలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. మొత్తంగా ఏడాది కాలంలో జరిగిన తొలి ర్యాంకింగ్ ఈవెంట్లో భారత్కు ఏడు పతకాలు దక్కాయి. మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ స్వర్ణం, సరితా మోర్ రజత పతకాలు దక్కించుకున్నారు.