మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం మార్చి 6: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు పట్టభద్రులకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ఖమ్మంలో జరిగిన పద్మనాయక వెలమ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు పాల్గొని, మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్ పరిశ్రమ, ములుగు గిరిజన వర్శిటీలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పోరాట పటిమ, కేటీఆర్ ప్రతిభాపాటవాలతోనే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని స్పష్టంచేశారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వెలమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.