బెంగళూరు: పోస్ట్మార్టమ్కు ముందు మృతదేహంలో కదలిక కనిపించింది. దీంతో ఆ వ్యక్తి మరణించలేదని గ్రహించి తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. కర్ణాటకలోని మహాలింగపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్తి బైక్ డ్రైవ్ చేస్తుండగా ఆదివారం ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించగా కొంత సేపటి తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ తొలగించారు. అనంతరం పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి శవాగారానికి తరలించారు.
కాగా, సోమవారం మృతదేహాన్ని బల్లపై ఉంచిన వైద్యులు పోస్ట్మార్టమ్ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా ఆ వ్యక్తి శరీరంలో కదలిక గుర్తించారు. దీంతో పరీక్షించగా అతడు మరణించలేదని తెలిసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆ వ్యక్తిని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగవుతున్నదని వారు తెలిపారు. దీంతో చనిపోయినట్లు తప్పుగా చెప్పిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులపై ఫిర్యాదు చేసేందుకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు.