ధర రూ.24 లక్షలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన బీఎండబ్ల్యూ మోటోరాడ్.. సరికొత్త క్రూయిజర్ బైకు ఆర్18 క్లాసిక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్లో ఈ బైకు రూ.24 లక్షలకు లభించనున్నది. 1,802 సీసీ సామర్థ్యంతో తయారైన ఈ బైకును ముందస్తుగా బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే తయారు చేసి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.