మంత్రి కేటీఆర్ను కోరిన ఎమ్మెల్యే సండ్ర
ఏజెన్సీకి నిధుల కోసం బాలసాని వినతి
సత్తుపల్లి రూరల్, జూలై 15: సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి చేయూతనిచ్చి నిధులు కేటాయించాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు గురువారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు, బ్లాస్టింగ్ ప్రభావిత బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, హామీ నిధుల వినియోగానికి అనుమతులు, వివిధ గ్రాంట్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే మంజూరు చేస్తామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ మహేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ బాలసాని వినతి
ఖమ్మం, జూలై 15: భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ.14 కోట్ల నిధులను కేటాయించాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.. మంత్రి కేటీఆర్ను కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రిని కలిసి ఏజెన్సీ ప్రజల ఇబ్బందులను వివరించి వినతిపత్రం సమర్పించారు.