రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
సెంట్రల్ లైటింగ్, వైకుంఠధామం, గ్రామపంచాయతీ భవనం ప్రారంభం
రఘునాథపాలెం, జూలై 2: రఘునాథపాలెం మండలాన్ని రోల్ మోడల్ చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వి.వెంకటాయపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, వైకుంఠధామం, నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ పల్లె ప్రగతి పనులు చేపడుతున్నదన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు అందిస్తున్నదన్నారు. దీనిలో భాగంగా వీ వెంకటాయపాలేనికి ఏటా రూ.50 లక్షల పైచిలుకు నిధులు అందుతున్నాయన్నారు. త్వరలో రఘునాథపాలెం మండలం వ్యవసాయ హబ్గా ఏర్పడుతుందన్నారు. జింకలతండా క్రాస్రోడ్డు సమీపంలో ఫుడ్ఫార్క్ జోన్ను తీసుకువస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగరపాలక కమిషనర్ అనురాగ్ జయంతి, జడ్పీటీసీ మాలోతు ప్రియాంక, ఎంపీపీ భుక్యా గౌరి, గ్రామ సర్పంచ్ రావెళ్ల మాధవి, ఎంపీటీసీ యరగర్ల హనుమంతరావు, ఉప సర్పంచ్ బానోతు లాల్సింగ్, వీవీ పాలెం సహకార సొసైటీ ఉపాధ్యక్షుడు రావెళ్ల అశోక్, ఏఎంసీ డైరెక్టర్లు పొట్లపల్లి రాజా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, నాయకులు కుతుంబాక నరేశ్, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్ పాల్గొన్నారు.