తిరుమల,మే1:టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థా ట్రస్టులకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఇన్చార్జ్ ఈవో ఏ.వి.ధర్మరెడ్డికి అందజేశారు.
ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.లక్ష, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 50 వేలు, విద్యాదాన ట్రస్టుకు రూ.50 వేలు, శ్రీవాణిట్రస్టుకు రూ.50 వేలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.50 వేలు, ఎస్వీ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు రూ.50 వేలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.50 వేలు, కోవిడ్ సహాయచర్యలకు రూ.50 వేలు వినియోగించాలని ఛైర్మన్ కోరారు.