తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దూసుకుపోతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీని పెంచుకుంటూ రెండు లక్షలకుపైగా ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2,12,227 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 4,77,151 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 2,64,924 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 44,758 ఓట్లు పోలయ్యాయి.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..