ఒంగోలు : మహిళతో సన్నిహితంగా మెలగడం యువకుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. నేలటూరు గ్రామానికి చెందిన అంకమ్మ రావుకు అదే గ్రామానికి చెందిన మహిళతో కొంతకాలంగా సన్నిహిత సంబంధం ఉంది. మహిళతో వివాహేతర సంబంధంపై స్నేహితులు తరచూ అంకమ్మరావుతో గొడవ పడుతుండే వారు.
ఆదివారం స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా బాధితుడిపై వారు పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆరోపణలున్నాయి. బాధితుడి కేకలు విన్న స్ధానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా 80 శాతం కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. స్ధానిక యువతితో సంబంధం వ్యవహారమే యువకుడి ప్రాణాలపైకి తీసుకువచ్చిందని చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.